ఓటుకు నోటు సూత్రధారి, పాత్రధారులు పెదబాబు, చినబాబేనని తేలిపోయింది: విజయసాయిరెడ్డి

  • నేరం చెయ్యడమే కాదు, కవర్ అప్ చేసేందుకు ప్రయత్నించారు
  • ఈడీకి మత్తయ్య ఇచ్చిన స్టేట్మెంట్లో రుజువైంది
  • వేరే రాష్ట్రాల్లో ఎన్నికలను మేనేజ్ చేసేందుకు ఆంధ్రను కొల్లగొట్టారు
  • ఇంకెంతమందిని మేనేజ్ చేస్తావు బ్రిఫ్డ్ బాబు?
ఓటుకు నోటు కేసులో మొత్తం వ్యవహారం ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సమక్షంలోనే జరిగిందంటూ ఆ కేసులో నిందితుల్లో ఒకరైన జెరూసలెం మత్తయ్య ఈడీకి చెప్పినట్లు వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందిస్తూ చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.

'ఓటుకు నోటు సూత్రధారి, పాత్రధారులు పెదబాబు, చినబాబేనని తేలిపోయింది. నేరం చెయ్యడమే కాదు, కవర్ అప్ చేసేందుకు ప్రయత్నించారని ఈడీకి మత్తయ్య ఇచ్చిన స్టేట్మెంట్లో రుజువైంది. వేరే రాష్ట్రాల్లో ఎన్నికలను మేనేజ్  చేసేందుకు ఆంధ్రను కొల్లగొట్టారు. ఇంకెంతమందిని మేనేజ్ చేస్తావు బ్రిఫ్డ్ బాబు?' అని విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు.

Vijay Sai Reddy
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News